The notification for the Civil Services Exam 2021 is likely to be released on February 10.
The notification will be released on the Union Public Service Commission (UPSC) website upsc.gov.in.
The exam will be conducted by Indian Administrative Service, Indian Forest Service and many other civil services.
There will be a preliminary exam first. Then there are the mains, then there are the interviews.
According to the exam calendar released by UPSC, the Civil Services Preliminary Exam will be held on June 27 this year.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021కి గాను ఫిబ్రవరి 10వ తేదీన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెబ్సైట్ upsc.gov.in లో ఆ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్తోపాటు పలు ఇతర సివిల్ సర్వీసెస్కు గాను ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. తరువాత మెయిన్స్, ఆ తరువాత ఇంటర్వ్యూ ఉంటాయి.
యూపీఎస్సీ విడుదల చేసిన ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూన్ 27వ తేదీన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్: ముఖ్యమైన సూచనలు
- కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫొటో ఐడీ కార్డును కలిగి ఉండాలి.
- ఆధార్, వోటర్ ఐడీ, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఏదైనా ఫొటో ఐడీ కార్డును ఉపయోగించవచ్చు.
- అప్లికేషన్ ఫాంను నింపేటప్పుడు ఫొటో ఐడీ కార్డ్ ను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేశాక అభ్యర్థులు ఆ ఫాంను ఉపసంహరించుకోవచ్చు. అందుకు యూపీఎస్సీ అనుమతి ఇస్తుంది.
- ఎగ్జామ్ సందర్భంగా ఫోన్లు, పేజర్లు, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచ్లు, కెమెరాలు, బ్లూటూత్ పరికరాలను అనుమతించరు.
- ఎగ్జామ్కు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అందుబాటులో ఉన్న పోస్టుల వివరాలను ప్రకటిస్తారు.
- ఫైనల్ మెరిట్ లిస్ట్లో లేకపోయినా ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అభ్యర్థులకు యూపీఎస్సీ మరో అవకాశం కల్పిస్తుంది.
- వారి సేవలను ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపయోగించుకుంటారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూపీఎస్సీని సంప్రదించాలి.
- ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వారు మెయిన్ ఎగ్జామ్కు ఎంపికవుతారు.
- మొత్తం 5 లక్షల మంది ఈ పరీక్షలను రాయనున్నారు.
- ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారు మళ్లీ మెయిన్ ఎగ్జామ్ కు కూడా పైన తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర పత్రాలకు చెందిన స్కాన్ కాపీలను మళ్లీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఇక మెయిన్ ఎగ్జామ్ను కూడా క్లియర్ చేస్తే అభ్యర్థులు సివిల్స్ లో తమకు ఆసక్తి ఉన్న సర్వీస్కు పనిచేసేందుకు మళ్లీ దరఖాస్తు చేయాలి. అందుకు వేరే ఫాం ఉంటుంది.