– ఎన్నికల చెల్లదంటూ వేసిన పిటిషన్ కొట్టివేత
ఇదేనిజం, హైదరాబాద్: ఎన్నికల అఫిడవిట్కు సంబంధించిన కేసులో మంత్రి శ్రీనివాసగౌడ్కు ఊరట లభించింది. శ్రీనివాస్గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. శ్రీనివాస్గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.
Read More :
చంపుతానని బెదిరించిన వెనక్కి తగ్గను..
http://idenijam.com/i-will-not-back-down-after-threatening-to-kill/