Homeతెలంగాణవీసీల నియామకం చేపట్టాలి: సీఎం

వీసీల నియామకం చేపట్టాలి: సీఎం

హైదరాబాద్: కరోనా కారణంగా యూనివర్సిటీల వీసీ నియామకంలో జాప్యం జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీసీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వీసీల నియామక ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించడం విశేషం. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందన్నారు. సెప్టెంబరు 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం. చర్చించాల్సిన అంశాలపై కేసీఆర్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

Recent

- Advertisment -spot_img