Homeజిల్లా వార్తలుఅయోధ్య రామయ్య అక్షింతల పంపిణీ

అయోధ్య రామయ్య అక్షింతల పంపిణీ

ఇదే నిజం, ఉప్పల్ : అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరం శ్రీబాలరాముని నూతన విగ్రహా ప్రాణప్రతిష్ఠాపన సందర్భంగా శివగంగానగర్, లక్ష్మినారాయణకాలనీలో బీజేపీ నాయకుడు జగదీశ్​, మున్నూరు కాపు రాష్ట్ర యువక మండలి కార్యదర్శి కైలాస్ రాఘవేంద్ర, శ్రీ రామ భక్తులు రాకేశ్​, కిరణ్ కుమార్, విజయ్, సంతోష్, బాబు రావు ప్రవీణ్ యాదవ్​తో కలిసి శ్రీరామ నామము జపిస్తూ ఇంటింట తిరుగుతూ అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 22 సోమవారం ప్రాణప్రతిష్ట శుభముహూర్త సమయానికి ముందే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల మధ్య భక్తులందరూ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించాలన్నారు. శ్రీబాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించాలని కోరారు. అదే రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి దీపోత్సవ పండుగ జరుపుకోవాలని తెలిపారు.

Recent

- Advertisment -spot_img