Homeహైదరాబాద్latest NewsCM రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. దేని గురించి అంటే..?

CM రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. దేని గురించి అంటే..?

సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. దాదాపు 20వేలకు పైగా కార్మికులు ఈ రంగంపై ఆధారపడ్డారని.. వారు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మార్కెట్ లేకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారన్నారు.

ALSO READ: BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి చేరిన నలుగురు కీలక నేతలు

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించి రూ.220 కోట్ల మేర బకాయి పడిందన్నారు. ఈ డబ్బులు రాకపోవడంతో ఆర్ధికంకా నానా తంటాలు పడుతున్నారన్నారు. కార్మికులను దృష్టిలో పెట్టుకొని వారికి బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులను ఓనర్లగా మార్చేందకు బీఆర్ఎస్ ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ స్కీంను తీసుకువచ్చారని.. కానీ అది అమలుకు నోచుకోలేదని చెప్పారు. మీరు ఆ నిధులను కేటాయించి వర్కర్లను ఓనర్లుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని బండి సంజయ్ లేఖలో రాశారు.

ALSO READ: ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇళ్లు లేనివారికి రూ.5లక్షలు.. మరి ఇందులో మీరున్నారా..?

Recent

- Advertisment -spot_img