మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. 21 మంది కౌన్సిలర్లు BRSకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. 19 మంది సంతకాలు చేసి పార్టీ BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు రాజీనామా లేఖను పంపారు. సంతకాలు చేయనప్పటికీ వైస్ ఛైర్మన్ సుదర్శన్తో పాటు 14వ వార్డు కౌన్సిలర్ బొడ్డు నారాయణ సైతం రాజీనామాకు అంగీకరించినట్లు తెలిసింది.
ఇటీవల BRSకు చెందిన 18మంది కౌన్సిలర్లు బస్సులో శిబిరానికి తరలివెళ్లారు. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారంతా రాజీనామా నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాల్సి ఉంది.
బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. వీటిలో ఒక వార్డు కౌన్సిలర్ గతంలో మృతి చెందారు. ప్రస్తుతం కాంగ్రెస్కు 11 మంది, BJPకి ఒకరు మద్దతు ఇస్తున్నారు. BRSకు చెందిన 21 మంది రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.