HomeతెలంగాణDrugs Case : డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు

Drugs Case : డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు

Drugs Case : డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం కార్యకర్తలు

Drugs Case : హైదరాబాదులో ఓ పబ్ పై పోలీసులు దాడి చేసిన ఘటనపై బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు.

డ్రగ్స్ కేసులో పలుకుబడి ఉన్నవాళ్ల పేర్లు తొలగిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

బంజారాహిల్స్ పబ్ లో దొరికిన అందరినీ కఠినంగా శిక్షించాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీజేవైఎం శ్రేణులు లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. బీజేవైఎం కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది.

ఓ దశలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి నాంపల్లి పీఎస్ కు తరలించారు.

Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?

Non-Veg Brahmins : దేశంలో కొన్ని చోట్ల‌ బ్రాహ్మణులు చేపల్ని ఎప్ప‌టినుంచో తింటున్నారు.. ఎందుక‌లా..

Recent

- Advertisment -spot_img