న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియాంకా గాంధీలను కూడా కలిసిన విషయం తెలిసిందే.
రానున్న రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల గురించి ప్రశాంత్ కిశోర్.. గాంధీలతో చర్చించినట్లు భావించినా.. అంతకంటే పెద్దదే ఏదో జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పడం గమనార్హం.
స్పుత్నిక్-వి టీకా డెల్టాతో పాటు ఇతర కరోనా వేరియంట్లపైనా ప్రభావవంతంగా పనిచేస్తుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వె్స్టమెంట్ ఫండ్ ప్రకటించింది.
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారి రక్తనమూనాలను సేకరించి విశ్లేషించగా ఈవిషయం వెల్లడైనట్లు తెలిపింది.
ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్, మాస్కోలో ఇటీవల గుర్తించిన వేరియంట్లకు వ్యతిరేకంగా ‘స్పుత్నిక్-వి’ రోగ నిరోధక ప్రతిస్పందనను కలిగించగలదని గుర్తించినట్లు పేర్కొంది.
సెప్టెంబరు నుంచి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో స్పుత్నిక్-వి ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించింది.
ఏటా 30 కోట్లకు పైగా డోసులను ఎస్ఐఐ ఉత్పత్తి చేస్తుందని తెలిపింది.
టీకా తయారీకి అవసరమైన కణాలు, వెక్టర్ శాంపిళ్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే ‘సీరమ్’కు బదలాయించామని స్పష్టంచేసింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.
నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న పాడి కౌశిక్రెడ్డి రాజీనామా చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికకు సమాయత్తమయ్యే క్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పీసీసీ ఇన్చార్జిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది.
ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లను నియమించింది.
అదే విధంగా… వివిధ మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జీలను నియమించింది.
ఈ మేరకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జీలు
వీణవంక – ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్
జమ్మికుంట – విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్
కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్ దాఖలు చేసింది.
ఈ సందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
అదే విధంగా… తెలంగాణ సర్కార్ జూన్ 28న ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరింది.
ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.
‘ఐస్క్రీమ్’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తేజేస్వి సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది.
చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా గుర్తింపును సంపాదించుకుంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తేజస్వి.. ఆ తర్వాత ‘లవర్స్’, ‘మనం’, ‘హార్ట్ ఎటాక్’ సహా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.
అయితే 2018లో వచ్చిన బిగ్బాస్-2లో పాల్గొన్న అనంతరం తేజస్వి పలు విమర్శలను ఎదుర్కొంది.
ముఖ్యంగా కౌశల్తో ప్రవర్తించిన తీరుతో ట్రోల్స్ బారిన పడి ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంది.
ఆ తర్వాత కారణాలు ఏవైనా సినిమా ఆఫర్లు మాత్రం తగ్గుతూ వచ్చాయి.
అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తన అందచందాలతో హాట్ ఫోటో షూట్లలో పాల్గొనే తేజస్వీ తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.
‘చిన్నప్పుడు పానీపూరి బండివాడ్ని పెళ్లి చేసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను చిన్నపిల్లను కాదు కదా..ఇప్పుడు అసలు పెళ్లే అవసరం లేదని రియలైజ్ అయ్యాను’ అంటూ పానీపూరి బండిని తోసుకెళ్తున్న ఫోటోను షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. కొంపదీసి ఆ బండిని మీ ఇంటికి తీసుకెళ్తావా ఏంటి అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్ల పాలన వస్తుందా? అక్కడి ప్రభుత్వాన్ని వారు కూలదోస్తారా? శాంతి ఒప్పందంలో భాగంగా అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లగానే తాలిబన్లు ఆఫ్ఘన్ మీద తిరిగి పట్టు సాధిస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో 85 శాతం భూభాగం తమ అధీనంలోనే ఉందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. వారి ధాటికి తట్టుకోలేక ప్రభుత్వ బలగాలు పారిపోతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.
మధ్య కొన్ని నెలల పాటు ఆఫ్ఘన్ను తాలిబన్లు పాలించారు. ఈ కాలంలో మహిళలపై కఠిన ఆంక్షలు విధించారు. తప్పు చేసిన వారికి క్రూరమైన శిక్షలను అమలు చేశారు.
ఇన్నేళ్లలో తాలిబన్ల దాడుల వల్ల ఆఫ్ఘన్లోని దాదాపు సగం జనాభా (1.84 కోట్లు) కనీస వైద్య సౌకర్యాలకు దూరమయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఆఫ్ఘన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి తాలిబన్లు భిన్న వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇరాన్, తజకిస్థాన్, టుర్క్మెనిస్థాన్, చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లోని ప్రాంతాలపై తాలిబన్లు ఇప్పటికే పైచేయి సాధించినట్టు తెలుస్తున్నది. తాలిబన్ల పాలనను వ్యతిరేకించే వారి నుంచి ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సహకారం అందకుండా నిరోధించడమే దీని లక్ష్యం. దీంతోపాటు దేశంలోని కీలక పట్టణాలను కూడా తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కాందహార్లో పరిస్థితులు క్షీణించడంతో భారత్ తన దౌత్యవేత్తలను స్వదేశానికి తీసుకొచ్చింది.
ఎందుకు ఆక్రమిస్తున్నారు?
దేశంలో ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది తాలిబన్ల లక్ష్యం. మహిళలకు ఓటు హక్కు, ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ యావత్ దేశాన్ని తమ గుప్పిట్లో తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమం లో గత కొన్నేండ్లుగా ప్రభుత్వ బలగాలు, తాలిబన్ల మధ్య భీకర పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి ఖతార్లోని దోహాలో గత సెప్టెంబర్లో చర్చలు జరిగినప్పటికీ ఫలప్రదంకాలేదు.
అమెరికా బలగాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి?
గతేడాది దోహాలో అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అగ్రరాజ్యం బలగాలను ఉపసంహరిస్తున్నది. అమెరికా, దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ భూభాగాన్ని ఎవరినీ వాడుకోనివ్వబోమని తాలిబన్తో అమెరికా ఈ ఒప్పందం కదుర్చుకుంది.
పాక్కు దడ
దశాబ్దాలుగా తాలిబన్లను పెంచి పోషించిన పాకిస్తాన్కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. తాలిబన్లను పెంచుతూ ఉగ్రవాదులను భారత్పైకి ఉసిగొల్పిన పాక్ తాను తీసిన గోతిలో తనే పడే పడుతున్నది. అమెరికా బలగాల ఉపసంహరణతో తాలిబన్లు తిరిగి ఆఫ్ఘన్ను ఆక్రమించుకొంటున్నారు. ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశం ఉన్నది. పాకిస్తాన్ దీన్ని ఊహించలేదు. చర్చల ద్వారా అధికార మార్పిడి జరుగుతుందని, తాలిబన్లు ఆఫ్ఘన్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తారని భావించింది. కానీ వాస్తవంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అంతర్యుద్ధం మొదలైతే పాక్లోకి ఆఫ్ఘన్ నుంచి వలసలు తప్పవని భావిస్తున్నారు. వలసలు గనుక మొదలైతే ఆపడం తమ తరం కాదని ఇటీవలే పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ అన్నారు.
ఎవరీ తాలిబన్లు?
1990 తొలినాళ్లలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియెట్ దళాలు వెనక్కి మళ్లాక ఉత్తర పాకిస్థాన్ ప్రాంతంలో ఆదివాసీల హక్కుల కోసం తాలిబన్లు పాటుపడ్డారు. అవినీతి నిర్మూలన, అభివృద్ధి నినాదాలతో మొదట్లో తాలిబన్లకు ప్రజాదరణ లభించింది. క్రమంగా వీళ్లు ఆఫ్ఘన్పై పట్టు బిగించి నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అదే సమయంలో కఠినమైన శిక్షల అమలు, మహిళలపై ఆంక్షలు విధించడంతో వారిపై వ్యతిరేకత మొదలైంది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టు ప్రభుత్వం రావడానికి సాయపడుతున్న సోవియెట్ యూనియన్ను బలహీనపరచడానికి తాలిబన్లకు అమెరికా సాయం చేసినట్టు చెబుతారు. అయితే, తాలిబన్లకు అప్పటివరకూ పరోక్ష మిత్రుడిగా ఉన్న అమెరికాపై సెప్టెంబర్ 11, 2001న (వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి) అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాడులకు పాల్పడ్డాడు. అతను అఫ్ఘాన్లో తలదాచుకున్నాడన్న సమాచారంతో అగ్రరాజ్యం లాడెన్ను అప్పగించాల్సిందిగా తాలిబన్లను కోరింది. దీనికి వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఉగ్రవాదుల ఏరివేత పేరుతో అమెరికా ఆఫ్ఘన్లో 20 ఏండ్లపాటు బలగాలను మోహరించింది.
రోజూ ఒక కప్పు, అంతకంటే ఎక్కువ కాఫీ తాగితే కరోనా ముప్పు 10 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
‘కాఫీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లెమేటరీ గుణాలు ఉంటాయి.
రోజూ ఒక కప్పు కంటే తక్కువగా కాఫీ తాగేవారితో పోలిస్తే ఒక కప్పు లేదా ఇంకొన్ని కప్పుల కాఫీ తాగే వారికి కరోనా ముప్పు 10 శాతం తక్కువగా ఉంద’ని నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు తెలిపారు.