Homeహైదరాబాద్latest Newsకేబుల్ బ్రిడ్జిపై క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య యత్నం..

కేబుల్ బ్రిడ్జిపై క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య యత్నం..

ఇదేనిజం,శేరిలింగంపల్లి : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన బుధవారం మధ్యాహ్నం  చోటు చేసుకున్నది. పర్వత్ నగర్ కు చెందిన ఎం .సాయి కిరణ్ (23) వృత్తి రీత్యా క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. అప్పుల బాధలు చుట్టుముట్టడంతో మనస్తాపం చెంది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మాదాపూర్ పోలీసులు అతని గమనించి రక్షించారు. మాదాపూర్‌ పోలీసులు సాయికిరణ్ కు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Recent

- Advertisment -spot_img