– నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితసంఘాల ఆందోళన
ఇదేనిజం, నల్లబెల్లి : దళితబంధు లబ్ధిదారులకు వెంటనే గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని దళితసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు వారు మంగళవారం నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు రెండో ఫేజ్ కింద 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆన్ లైన్ ప్రక్రియ సైతం పూర్తయ్యింది. కాగా నల్లబెల్లి మండలంలోని వీరిలో ఒక 147 మంది లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులు కలెక్టర్ లాగిన్ లో ఉన్నాయి. కాగా ఈ డబ్బును వెంటనే విడుదల చేయాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి ఎంపీటీసీ జన్ను జయరాం, దళిత సంఘాల నాయకులు, దళితబంధు దరఖాస్తు దారులు బోట్ల పవన్, బట్టు సాంబయ్య, అడ్డ రాజు, బొమ్మ కంటి అనిల్, నత్తి శ్యామ్, పరికి నవీన్, పరికి రత్నం తదితరులు పాల్గొన్నారు.