కరోనా సెకండ్ వేవ్లో ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడ్డారు.
తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు.
వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.
ఆండ్రియా నటిగానే కాదు, గాయనిగా కూడా ఆండ్రియాకు మంచి గుర్తింపు ఉంది.
యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు పొందారు.
ఇటీవల తనను కలిసిన వారందరూ తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరింది.
అందరూ తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.