Homeజిల్లా వార్తలుDharmapuri : యూ.పి.ఎస్ విధానం వద్దు.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలి : బండారి...

Dharmapuri : యూ.పి.ఎస్ విధానం వద్దు.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలి : బండారి సతీశ్

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) పట్టణం కేంద్ర ఆర్థిక శాఖ యూనిఫైడ్ పెన్షన్ విధానం పై జారీచేసిన నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో యూ.పి.ఎస్ ప్రతుల దగ్దం చేసి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జగిత్యాల జిల్లా కార్యదర్శి బండారి సతీశ్ మాట్లాడుతూ… సిపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని గత దశాబ్ద కాలంగా తీవ్ర పోరాటం చేస్తుంటే ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ఈ యుపిఎస్ విధానం తీసుకురావడం ప్రజాస్వామికమని ఇది కేవలం షేర్ మార్కెట్లోకి నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టే విధంగా ఉందే తప్ప, ఈ విధానంలో ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబ సామాజిక భద్రత కోణం లేదని తీవ్రంగా విమర్శించారు ఈ విధానం వల్ల ఉద్యోగి తన సర్వీస్ కాలంలో జమ చేసిన ప్రతినెల బేసిక్ ప్లస్ డి ఏ లో 10 శాతం చొప్పున జమ చేసిన సొమ్మును ఎన్పీఎస్ ట్రస్ట్ కు బదిలీ చేసిన తర్వాతనే ఉద్యోగికి సర్వీస్ పెన్షన్ నిర్ణయించడం అనేది అత్యంత దారుణమైన చర్య అని దీన్ని సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.ఉద్యోగ ఉపాధ్యాయులకు కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు నకారా కేసును గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మ్యాన పవన్ కుమార్ ,సందరికారి రాజేష్,చల్ల కృష్ణ, చుంచుకాల శ్వేతారాణి, పురం స్వప్న, రేణుక, మమత, అసిఫ్ బేగ్, రాజేష్,మహేష్, అనిత, సునీత, సింధూజ మరియు వారికి మద్దతుగా సీనియర్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, వెంకటరమణ,జనార్ధన్, రాజన్న, నరహరి, శ్రీకాంత్ మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img