Erabelli dayakar rao:కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం దివాళా తీసింది. బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది. గతంలో ఎట్లుండే? ఇప్పుడు ఎట్లున్నది ప్రభుత్వాల పరిపాలన ఎలా ఉందో ప్రజలు విశ్లేషించుకోవాలి. కెసిఆర్ వచ్చాకే వ్యవసాయం పండుగ అయింది. ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. కెసిఆర్ చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శం. మన రాష్ట్రం ఆచరిస్తున్నది… దేశం అనుసరిస్తున్నది. తెలంగాణ మాడల్ దేశానికి అవసరం. ఇక చారిత్రాత్మక పాలకుర్తిలో చరిత్రలో లేనంత అభివృద్ధి చేసి చూపించాము. ఇదంతా మనం ప్రజలకు చెప్పుకోవాలి. ప్రజలను చైతన్యం చేయాలి అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
14 ఏళ్ల ఉద్యమ ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఉద్యమ సారథి కెసిఆర్ సీఎం కావడం మన అందరి అదృష్టమని, అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ పాలన సాగుతుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని , మన రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్ది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా చేసిన ఘనత మన సీఎం కెసిఆర్ గారికే దక్కుతుందని మంత్రి దయాకర్ రావు అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పి కొట్టాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చార