హైదరాబాద్లో నకిలీ డాక్టర్లు ఎక్కువవుతున్నారు. డిగ్రీ లేకున్నా ఎంబీబీఎస్ బోర్డుపెట్టుకొని ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. నర్సింగ్ సేవలు చేసినవారు సొంతంగా క్లినిక్లు, మెడికాల్ షాపులు పెడుతున్నారు. అర్హత లేకున్నా యాంటీబాడీస్, స్టెరాయిడ్స్ ఇస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి వారికి ఏడాది జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధిస్తారు.