Homeహైదరాబాద్latest Newsనేటి నుంచి జగన్ బస్సు యాత్ర.. సొంత గడ్డ నుంచే ప్రారంభం

నేటి నుంచి జగన్ బస్సు యాత్ర.. సొంత గడ్డ నుంచే ప్రారంభం

వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మరో యాత్రకు సిద్దమయ్యాడు. మేమంతా సిద్ధం పేరుతో నేటి నుంచి జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే వైసీపీ సిద్ధం పేరుతో భారీగా బహిరంగ సభలను నిర్వహించింది. నాలుగు భారీ సభలు నిర్వహించిన తరువాత వైసీపీ కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ బుధవారం నుంచి సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇడుపులపాయలో ఇవాళ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు జగన్. ఈ యాత్ర 21 రోజులపాటు కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. సీఎం జగన్ బుధవారం ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్ననానికి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేస్తారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు.

మొదటి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీర పురాయనిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోకజవర్గాలు మినిహా మిగిలిన 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది.

కొత్తగా వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేము సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలు క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇదే ఊపును కొనసాగించేందుకు వైసీపీ అధినేత మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మేమంతా పేరుతో బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలను మినహాయించి మిగిలిన నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను వైసీపీ ముఖ్య నేతలు సిద్ధం చేశారు. గతంలో ఓదార్పు యాత్ర జరిగిన తీరును తలపించేలా మేమంతా సిద్ధం యాత్ర ఉండబోతుందని స్పష్టం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img