HomeతెలంగాణHydearbad:పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలి-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

Hydearbad:పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలి-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

Hydearbad: వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగుచేయాలని వ్యవసాయాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు,హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో వాతావరణ పరిస్థితులు, వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా, ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు .

వరిలో కూనారం సన్నాలు , కూనారం 1638, బతుకమ్మ, వరంగల్ 962, ఆర్ ఎన్ ఆర్ 21278, ఆర్ ఎన్ ఆర్ 29325, జగిత్యాల 1798, తెలంగాణ సోనా , ఎం టి యూ 1010 , జగిత్యాల 24423, ఐ ఆర్ 64, హెచ్ ఎం టి సోనా వంటి స్వల్ప కాలిక వంగడాలను మాత్రమే సాగు చేయాలన్నారు
ఈ నెలలో రాబోయే మూడు రోజులు, జులై 2వ వారం నుండి మరియు ఆగస్టు చివరి వరకు సాధారణ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లదించిందని తెలిపారు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు నాటుకునేలా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు తేలికైన నేలలలో వేసే పత్తి 50 నుండి 60 ఎంఎం, బరువు నేలలలో 60 నుండి 75 ఎంఎం వర్షపాతం నమోదవుతేనే విత్తుకోవాలన్నారు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

యాసంగిలో అకాలవర్షాల నుండి వరి పంట నష్టపోకుండా రైతులు పంటకాలాన్ని ముందుకు జరుపుకునేలా అవగాహన కల్పించాలి. వరి పంటకాలం ముందుకు జరుపుకునేలా రైతులను చైతన్యం చేస్తూ వ్యవసాయ శాఖ రూపొందించిన వీడియో సమావేశంలో విడుదల చేశారు క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు

Recent

- Advertisment -spot_img