– కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో శ్రమించాం
– ఆ పార్టీ నాయకులు గుగులోత్ దశ్రూ నాయక్
ఇదేనిజం, డోర్నకల్: కష్టపడ్డ కార్యకర్తలకే కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇవ్వాలని ఆ పార్టీ నేత గుగులోత్ దశ్రూ నాయక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు గత పదేండ్ల నుంచి ఎంతో శ్రమించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా.. ఇతర పార్టీ నుంచి చేర్చుకున్న లీడర్లకు పదవులు ఇస్తామంటే తాము ఒప్పుకోబోమని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రామచంద్రునాయక్ కు పలు సూచనలు చేశారు. ఎంతో యుద్ధం చేసిన తర్వాత కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని చెప్పారు. ఈ విజయం ఏ ఒక్కరి వల్లా సాధ్యం కాలేదని చెప్పారు. ఈ గెలుపు ప్రతి కార్యకర్త విజయం అని అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్తలు, చోటా మోటా లీడర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వారిని పార్టీలోకి తీసుకోకూడదని సూచించారు.