Homeహైదరాబాద్latest Newsలక్షన్నర కోట్లు అని చెప్పి మింగేయడానికి ఇదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక...

లక్షన్నర కోట్లు అని చెప్పి మింగేయడానికి ఇదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మూసీ ప్రాజెక్టుతో తనకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అని ఆరోపిస్తున్నారని… అయితే అది రూ.141 కోట్ల అగ్రిమెంట్ మాత్రమేనని స్పష్టం చేశారు. లక్షన్నర కోట్లు అని చెప్పి మింగేయడానికి ఇదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్నారు.
గుజరాత్‌లో సర్దార్‌ పటేల్‌ విగ్రహం, హైదరాబాద్‌లో సమేతమూర్తి ప్రాజెక్టును మెయిన్‌హార్డ్స్‌ సంస్థ చేపట్టిందన్నారు. మూసీ ప్రాజెక్టును అదే సంస్థ చేపడితే ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు.మూసీ ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని వాపోయారు. తాను కెప్టెన్‌లాంటివాడినని…జట్టు మొత్తం లేకపోతే ఒక్కడిని ఎలా అడుగుతానని అన్నాడు. ఈ టెండరు వద్దనుకుంటే రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Recent

- Advertisment -spot_img