ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. జిల్లాలోని బజార్ హత్నూర్, చిన్మయితండాలో ఆవుపై చిరుత దారుణంగా దాడి చేసి చంపింది. దీంతో చుట్టు పక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.