Homeహైదరాబాద్latest Newsమోడీజీ.. పేదల అకౌంట్లలో రూ. 15 లక్షలు వేశారా?

మోడీజీ.. పేదల అకౌంట్లలో రూ. 15 లక్షలు వేశారా?

– దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం
– ధరల పేరుగుదలకు కారణం బీజేపీ ప్రభుత్వమే..
– కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

ఇదే నిజం, జగిత్యాల: ప్రధాని మోడీ పేదల అకౌంట్లలో రూ. 15 లక్షలు వేశారా? అని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ధరల పెరుగుదలకు మోడీ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలే దేశంలో పునరావృతం అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఖాతా కూడా తెరవదని చెప్పారు. కాళేశ్వరం అవినీతికి ఆస్కారం ఇచ్చింది ప్రధాని మోడీయే అని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు అడ్లురీ లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోడీ వ్యాఖ్యలు విస్తుగొలిపాయని పేర్కొన్నారు. రైతుల అభివృద్ది మాట దేవుడెరుగు.. వ్యవసాయానికి పెట్టుబడి రెండితలు పెరిగిందని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img