– పాతబస్తీ కేంద్రంగా ముమ్మర తనిఖీలు
– తమిళనాడు రాష్ట్రంలోనూ..
– కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ కేసులో దూకుడు
ఇదేనిజం, హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రంలోని పలుచోట్ల, హైదరాబాద్లో ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. పాతబస్తీ కేంద్రంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. ఐఎస్ సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి ఇండ్లల్లో సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే కాక దేశంలోని పలు చోట్ల సైతం రెయిడ్స్ కొనసాగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. ఐఎస్ఐఎస్ఐ మాడ్యుల్లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. హైదరాబాద్ లోని మలక్ పేట, టౌలీచౌకీలో నాలుగు చోట్లు సోదాలు సాగుతున్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరులో ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. కోయంబత్తూరు కారు బాంబు కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.