బీజేపీ తీర్థం ఎన్టీఆర్ పుచ్చుకోనున్నాడా..అవుననే అంటున్నాయి బీజేపీ శ్రేణులు అందులోభాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో బీజేపీ నేత అమిత్షా భేటీ కానున్నాడనే ప్రచారం జరుగుతున్నది. మునుగోడు ఎన్నికల సందర్భంగా ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన అమిత్షా ఆదివారం సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నోవాటెల్ లో సమావేశం కానున్నారు.
రాబోయే ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా రంగంలోకి దించి ఏపీ, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తెరవెనుక బీజేపీకీ టచ్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది. తాత ఎన్టీఆర్ పేరుతోపాటు ఆయన నటన, వాగ్ధాటిని కూడా వారసత్వంగా తెచ్చుకున్న ఎన్టీఆర్ బీజేపీలో చేరితో బీజేపీకీ బలం చేకూరనుంది.
ఇప్పటికే ప్రభాస్, రాజమౌళి, పవన్కళ్యాణ్ బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వంతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుండటం..ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే దారిలో నడిస్తే బీజేపీకీ స్టార్ క్యాంపెయినర్లు తెలుగు రాష్ట్రాల్లో కొదువ ఉండదు.