ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలో నందమూరి అభిమానులు, టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఇది కూడా చదవండి: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..
టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఓరగంటి భార్గవ్ రామ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని చెప్పుకొచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గొల్లపెల్లి టీడీపీ మండల అధ్యక్షుడు సింగారపు కొమురయ్య యాదవ్, కందుకూరి తిరుపతి, ముద్దం లక్ష్మీ రాజం, భోజనపు భూపతి, గర్వెందుల రవి గౌడ్, సాన స్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఆ ఒక్క పాట వల్ల ప్రభుత్వమే మారింది: కేటీఆర్