– రామప్ప దేవాలయంలో ప్రత్యేకపూజలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారు. రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రచార సన్నాహాల్లో భాగంగా బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ప్రారంభం కానున్నది. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 18న ములుగు, భూపాలపల్లిలో రాహుల్ పర్యటన ఉండనుండగా.. ఆ రోజున ములుగులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 19న కరీంనగర్ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ రోజున భూపాలపల్లిలో బహిరంగ సభ ఉండనుంది.