Homeఫ్లాష్ ఫ్లాష్T20 World Cup: భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌‌కు వర్షం అడ్డంకి.. నేటి మ్యాచ్ రద్దయితే..?

T20 World Cup: భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌‌కు వర్షం అడ్డంకి.. నేటి మ్యాచ్ రద్దయితే..?

టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా కాసేపట్లో భారత్- ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. మ్యాచ్ జరగాల్సిన గయానా స్టేడియం వద్ద భారీగా వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ రద్దు అయితే భారత్ ఫైనల్‌కు చేరనుంది. కాగా, ఈ నెల 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. అయితే మ్యాచ్‌కి 250 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఒక వేళ అదీ సాధ్యంకాక మ్యాచ్ రద్దయితే భారత్ తన పాయింట్లు, నెట్ రన్ రేట్ ఆధారంగా ఫైనల్స్ చేరుతుంది. సూపర్‌-8లో భారత్‌ గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలవడమే ఇందుకు కారణం.

Recent

- Advertisment -spot_img