హైదరాబాద్ః ప్రముఖ నటి తమన్నా ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆమె పేరెంట్స్ కు కరోనా పాజిటివ్గా తేలిందని స్వయంగా తానే ట్విటర్లో పోస్ట్ పెట్టింది. కోవిడ్-19 లక్షణాలు కన్పించడంతో తామందరం టెస్టులు చేయించుకున్నామని, పేరెంట్స్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని, తనకు మిగత కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వైద్యాధికారుల సూచనల మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ ఉంటే త్వరగా కరోనా నుంచి బయటపడతామన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.