– సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దరావత్ వెంకన్న నాయక్
ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: కురవి ఆలయ చైర్మన్ పదవి లంబాడీలకే ఇవ్వాలని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దరావత్ వెంకన్న నాయక్ పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ పదవిని లంబాడీ బిడ్డలకే ఇవ్వాలని కోరారు. మంగళవారం కురవి ఆలయ సత్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కువగా బంజారాలు ఆరాధించే దైవం కురవి వీరభద్రస్వామి అని పేర్కొన్నారు. ఆ దేవుడిని 70 శాతం లంబాడి బిడ్డలే కొలుస్తారన్నారు. లంబాడీల ఆరైద్యదైవమైన కురవి వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ లంబాడి బిడ్డ అయితే ఈ ఆలయానికి అభివృద్ధి దిశగా తీసుకెళ్తాడని అభిప్రాయపడ్డారు. ఆలయభూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు గుగులోత్ నందులాల్ నాయక్, సేవాలాల్ సేన కురవి మండల నాయకులు నాగేశ్ నాయక్, బొడ సేవ్య నాయక్, రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.