ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కుక్కలను పెంచుకోవడం చాలామందికి హాబీ. కొంతమంది వాటితో ప్రత్యేక అనుబంధం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా హైదరాబాద్ లో రూ. 20 కోట్లు ఖరీదు చేసే ఓ కుక్క ప్రత్యక్షమైంది. దీన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. కాకాసియన్ షెపెర్డ్ జాతి కుక్క తాజాగా మియాపూర్ లో కనిపించింది. శనివారం మియాపూర్లోని విశ్వ పెట్ క్లినిక్కు ఆరోగ్య పరీక్షల కోసం శునకాన్ని తీసుకువచ్చారు. బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు సతీశ్ ఇటీవల కాకాసియన్ షెపెర్డ్ జాతికి చెందిన శునకాన్ని రూ.20కోట్లకు కొనుగోలు చేశారు. ఆ శునకానికి కాడాబామ్ హైడర్ అనే పేరు కూడా పెట్టారు. శనివారం హైదరాబాద్లో జరిగే డాగ్ షో కోసం శునకాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. మియాపూర్కు వస్తుందని తెలియడంతో దాన్ని చూసేందుకు స్థానికులంతా ఎగబడ్డారు.