ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో రెండు ర్యాలీలు ఉన్నాయి. అందులో ఒకటి టీడీపీ ర్యాలీ. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ వరకు జరుగనుంది. రెండోది భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచకప్ విజయోత్సవ ర్యాలీ. మెహదీపట్నం నుంచి ఈద్గా మైదానం వరకు జరుగుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవ్వొచ్చని, వాహనదారులు వేరే మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.