Homeజిల్లా వార్తలుకవి మాన్యపు బుజేందర్​కు సత్కారం

కవి మాన్యపు బుజేందర్​కు సత్కారం

ఇదే నిజం ప్రతినిధి వరంగల్: ఏపీలోని రాజమండ్రిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో ప్రముఖ కవి, కళాకారుడు మాన్యపు బుజేంధర్​ కు ఘన సత్కారం లభించింది. రాజమండ్రిలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో తెలుగు మహాసభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభల్లో బుజేందర్​ పాల్గొని కవితా గానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య కళాశాల ఆధ్వర్యంలో ప్రశంసా పత్రం, మెడల్​తో సత్కరించారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలలో జనగామ జిల్లా నుంచి పాల్గొని కవిత గానం చేసి సత్కారం పొందడం అభినందనీయమని స్థానిక కవులు, కళాకారులు అభినందించారు.

Recent

- Advertisment -spot_img