ఇదే నిజం ప్రతినిధి వరంగల్: ఏపీలోని రాజమండ్రిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో ప్రముఖ కవి, కళాకారుడు మాన్యపు బుజేంధర్ కు ఘన సత్కారం లభించింది. రాజమండ్రిలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో తెలుగు మహాసభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభల్లో బుజేందర్ పాల్గొని కవితా గానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య కళాశాల ఆధ్వర్యంలో ప్రశంసా పత్రం, మెడల్తో సత్కరించారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలలో జనగామ జిల్లా నుంచి పాల్గొని కవిత గానం చేసి సత్కారం పొందడం అభినందనీయమని స్థానిక కవులు, కళాకారులు అభినందించారు.