ఇదే నిజం, చింతల మనేపల్లి: తాము 90 ఏండ్లుగా కాస్తులో ఉన్నా.. రెవెన్యూ అధికారులు తమ భూమిని పట్టా చేయడం లేదని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం రెబ్బెన గ్రామానికి చెందిన మందాడి భీమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత 90 సంవత్సరాల నుంచి కాస్తులో ఉండి తమ భూమి ఆన్ లైన్ లో కనిపంచడం లేదని ఆయన చెబుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా తమ భూమి రిజిస్టర్ చేయడం లేదన్నారు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా వాణి కార్యక్రమంలో ఆయన ఫిర్యాదు చేశారు.