10th Class Results : టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయబోతుంది. ఏపీ 10 తరగతి బోర్డు పరీక్షలు మార్చి 17న ప్రారంభమై మార్చి 31, 2025న ముగిశాయి. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు తమ ఫలితాలను BSEAP-bse.ap.gov.in అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేయవచ్చు.