ఎల్బీనగర్ లేదా ఉప్పల్ నుంచి పోటీ?
Chikoti Praveen: ఇదేనిజం, నేషనల్ బ్యూరో: చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయ ఎంట్రీపై చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీలో కొందరు బీజేపీ నేతలను కలవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తాజాగా చీకోటి ప్రవీణ్ కుమార్ ఢిల్లీలో బండి సంజయ్, డీకే అరుణను కలిసి శాలువా కప్పారు. దీంతో చీకోటి బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. చీకోటి ప్రవీణ్ కుమార్ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆయన ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్ నుంచి చికోటి ప్రవీణ్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.