– మిథున్ రెడ్డికి మహబూబ్నగర్ టికెట్
– జితేందర్ రెడ్డి పార్టీ మారతారన్న అనుమానంతో కుమారుడికి టికెట్?
ఇదేనిజం, హైదరాబాద్: ఒకే ఒక్క అభ్యర్థి పేరుతో బీజేపీ రెండో జాబితా విడుదలైంది. మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి టికెట్ కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటనను విడుదల చేసింది. ఒకే ఒక్క పేరుతో బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల కావడం గమనార్హం. జితేందర్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగిన విషయం తెలిసిందే. జితేందర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం కీలక నేతలతో కలిసి వరస భేటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. దీంతో బీజేపీ హైకమాండ్ ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చినట్టు సమాచారం.