– ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి
– జహీరాబాద్ బహిరంగసభలో ప్రియాంకా గాంధీ
ఇదేనిజం, తెలంగాన బ్యూరో: ఈ పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయని చెప్పారు. జహీరాబాద్లో నిర్వహించిన బహిరంగసభలో ప్రియాంకా గాంధీ మాట్లాడారు. ‘తెలంగాణలో ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్ల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేసింది. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.’ అంటూ ప్రియాంకా ప్రశ్నించారు.