మాస్ హీరో రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లో ఏషియన్ రవితేజ పేరుతో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఓ బిల్డింగ్లో పూజా కార్యక్రమానికి ఆయన కుమార్తె మోక్షద హాజరయ్యారు. ఇది చూసి రవితేజ ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోయారు.
టాలీవుడ్ హీరోల్లో మొదట మహేశ్ బాబు ఈ బిజినెస్లోకి అడుగుపెట్టారు. ఏఎంబీ పేరుతో హైదరాబాద్లో పలు మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏఏఏ పేరుతో థియేటర్ నిర్మించారు. విజయ్ దేవరకొండ కూడా మహబూబ్నగర్లో ఏవీడీ అనే థియేటర్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. త్వరలో విక్టరీ వెంకటేశ్ కూడా ఈ బిజినెస్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.