విజయవాడ నగరంలో మరోసారి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ సీహెచ్ ఎస్ రావుపై అల్లరి మూకలు దాడి చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరంగల్ నుంచి కార్గో వాహనం నడుపుతూ విజయవాడ వస్తుండగా..ఇబ్రహీంపట్నం కూడలి దాటాక రౌడీ మూకలు డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిలో డ్రైవర్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.