ఒడిశాలో ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. గంజాం జిల్లాలో టీ షాప్లోకి ఆయిల్ ట్యాంకర్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురి మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. బస్సును ఆయిల్ ట్యాంకర్ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.