Homeహైదరాబాద్latest Newsఏపీ సీఎం చంద్రబాబుకు షాక్.. వైసీపీ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి

ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్.. వైసీపీ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి

ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈరోజు మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు ఈరోజు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ముదునూరి మురళీకృష్ణం రాజు వెల్లడించారు. అయితే అందరూ అధికార పార్టీ వైపు చూస్తుంటే అధికార పార్టీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రత్తిపాడులో స్థానిక పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img