Homeహైదరాబాద్latest NewsNTR కు భారతరత్న?

NTR కు భారతరత్న?

– మోడీ అధ్యక్షతన కేబినెట్​ సమావేశం
– ఎప్పటినుంచో డిమాండ్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కెబినెట్​ సమావేశం కాబోతున్నది. ఈ మీటింగ్​ అనంతరం భారత రత్న అవార్డుపై ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్​ కు భారత రత్న ఇవ్వాలని చాలా రోజులుగా డిమాండ్​ ఉంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోలేదు. చంద్రబాబు సపోర్ట్​తో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సైతం.. చంద్రబాబు భారతరత్నపై పూర్తిస్థాయిలో ఒత్తిడి చేయాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్​ కు భారత రత్న ఇవ్వడం ద్వారా రాజకీయలబ్ధి పొందొచ్చని మూడు పార్టీలు భావిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img