Homeఫ్లాష్ ఫ్లాష్కేసీఆర్ నిజంగా హిందువైతే..పాతబస్తీలో బహిరంగ సభ పెట్టు: బండి సంజయ్

కేసీఆర్ నిజంగా హిందువైతే..పాతబస్తీలో బహిరంగ సభ పెట్టు: బండి సంజయ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా హిందువైతే..పాతబస్తీలో బహిరంగ సభ పెట్టి దేశద్రోహ పార్టీ మజ్లిస్ అరాచకాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నేత బండి సంజయ్ సవాల్ విసిరారు.

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ కుర్మగూడలో నిర్వహించిన ప్రచారంలో సంచలన కామెంట్స్ చేశారు.

కేసీఆర్ తన స్వార్థం కోసం యాగాలు చేసి.. కాషాయ వస్ర్తాలు ధరిస్తే హిందువు అయితవా అని ప్రశ్నించాడు.

దేశద్రోహ పార్టీ, హిందూ దేవుళ్లను దూషించే పార్టీ మజ్లిస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నీవు ఎలాంటి హిందువో సమాజం అర్ధం చేసుకుంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు.

భాగ్యనగర్ నిరుద్యోగులను నట్టేట ముంచిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులాలు, వర్గాలకు అతీతంగా ఒక్కటై ఓటుతో బుద్ది చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ లో మత కల్లోలాలు రగిల్చేందుకు కుట్ర చేస్తున్నారని చెబుతున్న సీఎం కేసీఆర్, డీజీపీల దగ్గర పక్కా సమాచారముంటే ఎందుకు అరెస్టు చేయడం లేదో స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆరే సాక్షాత్తుగా భయాందోళనలు సృష్టించి ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనకుండా కుట్ర చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

సీఎం కేసీఆర్ కు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ప్రజలెవరూ భయపడొద్దు. తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనండి.

బీజేపీ అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని బండి సంజయ్ కోరారు.

Recent

- Advertisment -spot_img