Rangareddy : రాజేంద్రనగర్ పరిధి గండిపేట మండలం బండ్లగూడ జాగీర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రత్నాదీప్ సూపర్ మార్కెట్ భవనంలో ఏసీ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదావశాత్తు మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. సూపర్ మార్కెట్లో ఉన్న విలువైన వస్తువులు అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి.