IPL 2025: ఉత్తరప్రదేశ్ కుర్రాడు విప్రాజ్ నిగమ్ను ఢిల్లీ జట్టు రూ.50 లక్షలకు దక్కించుకొంది. ఈ యువ ఆల్రౌండర్ 2024 యూపీ టీ20 టోర్నీ సీజన్లో మెరుపులు మెరిపించి ఢిల్లీ ప్రాచైజీ దృష్టిలోపడ్డాడు. యూపీ ఫాల్కన్స్ తరపున 12 మ్యాచ్లు ఆడి.. 20 వికెట్లు పడగొట్టాడు. ఇక దేశవాళీలో 2024-25 సీజన్లో తొలిసారి ఉత్తరప్రదేశ్ జట్టు అన్ని ఫార్మాట్లకు ఎంపికయ్యాడు. మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, ఐదు లిస్ట్-ఎ గేమ్లు, 8 టీ20లు ఆడాడు.