Homeసినిమాసెమీస్​ మ్యాచ్​లో ‘Animal’ Promotion​కు ప్లాన్

సెమీస్​ మ్యాచ్​లో ‘Animal’ Promotion​కు ప్లాన్

ప్రస్తుతం బాలీవుడ్​లో మోస్ట్ అవైటెడ్​ మూవీ ‘యానిమల్’. రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్​గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్​లో తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం వరల్డ్​వైడ్​గా సాలిడ్​ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న నేపథ్యంలో యానిమల్ మూవీ మేకర్స్ దృష్టి సెమీస్ మ్యాచ్​లపై పడింది. నేడు వాంఖడే స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్​ను తాను వెళ్లనున్నట్లు ఇండియన్ జెర్సీతో రణబీర్​ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో యానిమల్ ప్రమోషన్స్ విషయంలోమేకర్స్ మంచి ప్లానింగ్​లో ఉన్నట్లు చెప్పాలి. ఈ సినిమా డిసెంబర్ 1న పాన్​ ఇండియా లెవెల్​లో రిలీజ్​ కానుంది.

Recent

- Advertisment -spot_img