ఆంత్రప్రదేశ్లో వరుస ప్రమాద ఘటనలపై ప్రధాని మోడీ ఆరా తీసారు. తాజాగా విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రధాని నేరుగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రి అదనంగా హోటల్ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్గా సేవలందిస్తోందని తెలిపారు. ప్రమాదంపై వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్మీడియా వేధికగా సానుభూతి తెలియజేశారు. కేంద్రం ఆంద్రప్రదేశ్కు అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ఇప్పటికి దాదాపు 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.