హైదరాబాద్: ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్.
ఆ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి, విడాకులు ఇలా వివిధ కారణాలతో సినిమాలకు దూరమయ్యారు.
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఒక కొత్త సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు.
మరో వైపు ‘ఆద్య’ అనే క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
కాగా చాలా కాలం తరువాత రెండు దేశాయ్ తన అభిమానులతో ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు.
ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేణు స్పందిస్తూ..ప్రేమలో విఫలం అయ్యామని ఆత్మహత్య చేసుకోవడం సరైన మార్గం కాదన్నారు. మన ప్రాణం, జీవితం కన్నా ఎవరూ ఎక్కువ కాదు అన్నారు.
ప్రేమించిన వ్యక్తి మనతో లేకుండా, మనల్ని మోసం చేసారనే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ ఆలోచనలు చాలా కష్టంగా ఉంటాయన్నరు.
ప్రేమ విఫలమైతే తట్టుకోవడం కష్టమే కానీ మెల్లిమెల్లిగా ఈ బాధ నుంచి బయటపడవచ్చని సలహా ఇచ్చారు.
కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూ మళ్ళీ సాధారణ స్థితిలోకి రావచ్చన్నారు. అంతేగాని ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు.
రైతుల నేపథ్యంలో రేణు దేశాయ్ ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని తెలిపారు.