Homeజిల్లా వార్తలుWarangal​ ఎంపీ బరిలో RS Praveen Kumar​ ?

Warangal​ ఎంపీ బరిలో RS Praveen Kumar​ ?

– బీజేపీ నుంచి మందకృష్ణ !
– కాంగ్రెస్​ నుంచి సాంబయ్య
– రసవత్తరంగా మారనున్న ఎన్నిక

ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: వరంగల్​ పార్లమెంటు బరిలో ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ పోటీ చేయబోతున్నట్టు సమాచారం. ఇక బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారనున్నది. ​ మరికొన్ని రోజుల్లో లోక్​ సభ ఎన్నికలకు నోటిఫికేషన్​ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్​ నుంచి పోటీ చేసిన ఆర్​ ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఓటమిని చవిచూశారు. దీంతో తాజాగా ఆయన వరంగల్​ నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతితోనూ సంప్రదింపులు జరపనున్నట్టు సమాచారం.

గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు వరంగల్ పార్లమెంటుపై దృష్టి సారిస్తున్నాయి. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జిల్లా నేతలతో సమాలోచనలు జరిపి బీఎస్పీ అధినేత్రి మాయావతి దృష్టికి తీసుకుపోయినట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్​ నుంచి ఈ సారి ఆరూరి రమేశ్​ పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ టికెట్​ దొమ్మాటి సాంబయ్యకు ఇచ్చే చాన్స్​ ఉందని తెలుస్తోంది. ఇక వీరితోపాటూ ఓ సీనియర్​ జర్నలిస్ట్​ సైతం పోటీలో ఉండబోతున్నట్టు సమాచారం. దీంతో వరంగల్​ పార్లమెంటు ఎన్నిక ఇంట్రెస్టింగ్​ మారనున్నది. ఆర్​ ఎస్​ ప్రవీణ్​ కుమార్​, మందకృష్ణ మాదిగతో పాటూ కాంగ్రెస్, బీఆర్ఎస్​ కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితే చతుర్ముఖ పోటీ జరిగే చాన్స్​ ఉంది.

Recent

- Advertisment -spot_img