Homeహైదరాబాద్latest Newsగ్రామస్థాయి ప్రజా వాణి కార్యక్రమములో దరఖాస్తుల స్వీకరణ

గ్రామస్థాయి ప్రజా వాణి కార్యక్రమములో దరఖాస్తుల స్వీకరణ

ఇదే నిజం, దేవరకొండ: కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో గల చిన్న అడిశర్లపల్లి గ్రామపంచాయతీలో నిన్న ప్రజావాణి కార్యక్రమము పంచాయతీ సెక్రెటరీ పి సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ… ప్రజావాణి వలన ప్రజలకు సమస్యలను తీరుతాయని, అలాగే ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి కూడా ప్రజలు తెలుసుకునే విధంగా గ్రామపంచాయతీలోనే అన్ని సమస్యలు చెప్పుకునే విధంగా జరుగుతుందని తెలియజేశారు. తరువాత వీధిలో ఉండే జీవాలకు దాహం తీర్చే తొట్లను శుభ్రంగా ఉంచుకోవాలని లేనియెడల అవి ఆనరోగ్యానికి గురవుతావని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యుత్ కు సంబంధించిన ఒక్క దరఖాస్తునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు స్కూల్ హెడ్మాస్టర్ జి కోటయ్య, గోపాలమిత్ర భూతరాజు సైదులు, ఏఎన్ఎం యన్ లలిత, ఏ అనూష, అంగన్వాడి టీచర్ ఆర్ భాగ్యలక్ష్మి, ఆర్ సుజాత, సంఘ బంధం అధ్యక్షురాలు యన్ స్వరాజ్య లక్ష్మి , ఆశా వర్కర్ నీలమ్మ, వివో ఏలు జి ముత్యాలి, జె బాబు, లైన్మెన్ సి హెచ్. నరేందర్,పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img