Homeహైదరాబాద్latest Newsపోతుగల్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా మారేపు రాజా నందం ఎన్నిక

పోతుగల్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా మారేపు రాజా నందం ఎన్నిక

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సభ్యులంతా నూతన అధ్యక్షుడిగా మారేపు రాజా నందం ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మండోజు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శిగా కల్వోజు గంగాధర్, కోశాధికారి మెతుకు పెంట చారి లను ఏకగ్రీవంగా సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మారేపు రాజా నందం మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తానని సంఘ అభివృద్ధికి పాటుపడతానని సంఘంలోని సభ్యుల సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణుల సంఘ సభ్యులు నరేందర్, శంకర్ రాంప్రసాద్, శ్రీధర్, నవీన్ చారి, ప్రవీణ్ చారి, శ్రీనివాసచారి, రాజు, వెంకటాచారి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img